telugu navyamedia
వార్తలు సామాజిక

ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ కొత్త టైంటేబుల్‌

special train between vijayawada to gudur

విజయవాడ-లింగంపల్లి-విజయవాడ మధ్య తిరిగే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ టైంటేబుల్‌ను దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. జనవరి నుంచి కొత్త టైమింగ్స్‌ అమల్లోకి తెస్తామని గతంలో ప్రకటించిన రైల్వేశాఖ తాజాగా నవంబరు 3 నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. పగిడిపల్లి-నల్లపాడు సెక్షన్ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్‌ తెలిపారు.

కొత్త టైం టేబుల్‌ ప్రకారం12796 లింగంపల్లి – విజయవాడ రైలు గుంటూరుకు ఉదయం 9.20కే చేరుకుని 9.22కి బయలు దేరుతుంది. మంగళగిరికి 9.42కి చేరుకుని 9.43కి బయలు దేరుతుంది. విజయవాడకు ఉదయం 10.30కి చేరుతుంది. నంబరు 12795 విజయవాడ – లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌కి రాత్రి 10.20కి చేరుకుని 10.25కి బయలుదేరుతుంది. బేగంపేటకు రాత్రి 10.34కి చేరుకుని 10.35కి బయలుదేరి లింగంపల్లికి రాత్రి 11.15కి చేరుకుంటుంది.

Related posts