వచ్చే నెల 4న ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం సకాలంలో ఏర్పాట్లను పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూపరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు సమాయత్తంగా ఉండాలని రాష్ట్ర ఆదేశించారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ధియరీ పరీక్షలు కూడా సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకుని సంబంధిత శాఖాధికారులతో సమీక్షించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆమె సూచించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్ఠిసారించాలన్నారు.