telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభం

Inter sport valuation

తెలంగాణలో ఈ రోజు ఇంటర్మీడియట్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. హైద్రాబాద్ లోని గన్‌ఫౌండ్రీ మహబూబియా కాలేజీలో ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ కు సిబ్బంది హాజరయ్యారు. కరోనా కారణంగా ఈసారి 33 కేంద్రాల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పేపర్లను దిద్దుతారు. అనంతరం మొదటి సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది.

స్పాట్‌ వాల్యుయేషన్‌ విధుల్లో 15 వేల అధ్యాపకులు పాల్గొంటున్నారు. ఈ ఏడాది 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. మొత్తం 55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. మూల్యాంకన కేంద్రాల్లో అధికారులు కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక్కో ఉద్యోగికి మూడు మాస్కులు, శానిటైజర్లు, పోలీసు పాసులను ప్రభుత్వం అందించింది. అదేవిధంగా వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న సిబ్బందికి రవాణా, వసతి సదుపాయాలను కల్పించింది. జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు ప్రకటించే అవకాశముంది.

Related posts