telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ ఎరువుల కర్మాగారం పై పరిశ్రమల శాఖ మంత్రి విచారణ…

విశాఖపట్నంలో ఎరువుల కర్మాగారం ‘కోరమాండల్’ నుండి వాయువు వెలువడిందన్న వార్తలపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కర్మాగారం పరిసర గ్రామాల్లో స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో వస్తున్న కథనాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, గాజువాక పరిసర ప్రాంత అధికార యంత్రాంగంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.ఎవరికీ ప్రమాదం లేదని తెలిసిన, స్థానిక ప్రజలకు భరోసా కలిగే విధంగా అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి మేకపాటి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. వాయువు వెలువడిన కర్మాగారం ఏదనే దానిపై స్పష్టత లేకపోవడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి మేకపాటి సూచించారు. వాయువు వెలువడిన కర్మాగారం,దాని ప్రభావం, కారణాలపై నివేదిక కావాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులకు తెలిపారు.

Related posts