ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్, జపాన్ షట్లర్ అకానె యమగూచి గెలుపొందింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేములను కైవసం చేసుకొని సింధును చిత్తుగా ఓడించింది.
రెండు ఆటల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి ఆధిక్యం సాధించింది. ఈ సీజన్లో సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. 2019లో ఓ అంతర్జాతీయ టోర్నీలో తొలి టైటిల్ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు. ఈ ఫైనల్లో ఏకపక్షంగా సాగిన తుదిపోరులో జపాన్ క్రీడాకారిణి టైటిల్ కైవసం చేసుకుంది.
భూదందా కోసమే రాజధాని మార్పు: కన్నా