telugu navyamedia
pm modi నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు సామాజిక

ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు భారత ప్రభుత్వం సాయం

భూకంప తీవ్రతకు మయన్మార్ కకావికలం అయ్యింది.  వరుసగా వచ్చిన ఆరు భూకంపాలు మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భయ కంపితులు చేశాయి.

భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్ప కూలిపోయాయి. వందల మంది చనిపోయారు వేల మంది శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం, ఆర్మీ ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నం అయి ఉన్నాయి.

ఈ భూవిలయంలో సుమారు 700 మంది వరకు మరణించారని 1670 మంది వరకు గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతేకాక భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది.

భూవిలయంతో బాధపడుతున్న మయన్మార్ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్కు ఆపన్న హస్తం అందించింది.

ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది.

15 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్కు తరలించింది.

థాయ్‌లాండ్‌ లో భూకంపం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారు. వారంతా కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు.

భూకంపం నేపథ్యంలో మయన్మార్‌ లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్ప కూలిపోయాయి.

భూకంప తీవ్రతకు మయన్మార్‌ లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి.

అలానే మయన్మార్ రాజధాని నేపిడాలోని ప్రధాన రహదారులన్ని దెబ్బతిన్నాయి. థాయ్లాండ్లో కూడా ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి.

Related posts