భారత్-వెస్టిండీస్ మూడో టీ20 టాస్ వర్షం కారణంగా ఆలస్యమైంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టులో మూడు మార్పులు చేసినట్టు పేర్కొన్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ను తీసుకున్నారు. రాహుల్ చాహర్ అరంగేట్రం చేస్తున్నాడు. అతడి సోదరుడు దీపక్ చాహర్కు తుది జట్టులో చోటు దక్కింది.
భారత్: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్పంత్ పంత్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, నవదీప్ సైని
వెస్టిండీస్: ఎవిన్ లూయిస్, సునిల్ నరైన్, కీరన్ పొలార్డ్, హెట్మైయిర్, రోమన్ పావెల్, బ్రాత్వైట్, కీమో పాల్, అలెన్, కాట్రెల్, థామస్