ప్రపంచకప్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో భారత్ గెలిచి, విజయపరంపరను కొనసాగిస్తుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ లో స్థానం దక్కించుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో 314 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే ఆలౌట్ సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.
సెమీస్ లో స్థానం దక్కించుకున్న కోహ్లీ సేనకు టీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ సాధించేందుకు మరో రెండు విజయాల దూరంలో భారత జట్టు నిలించిందని ట్వీట్ చేశారు.
దిశ ఘటన : ఎన్కౌంటర్పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు