telugu navyamedia
క్రీడలు

న్యూజిల్యాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్..

న్యూజీలాండ్ క్రికెట్ జట్టుతో టీమిండియా ఇవాళ టీ20 క్రికెట్ మ్యాచ్ లో తలపడబోతోంది. జైపూర్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఆసక్తిరేకెత్తిస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సత్తా చాటేందుకు సమాయాత్తమైంది.

న్యూజిలాండ్ జట్టుకు వివిధ ఆరోగ్య కారణాలతో కేన్ విలియంసన్, జెమీసన్ దూరమయ్యారు. మూడు టీ20 క్రికెట్ మ్యాచుల్లో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జైపూర్, 19 తేదీన కాన్పూర్, 21 తేదీనే ముంబయిలో మ్యాచ్ నిర్వహించేవిధంగా షెడ్యూలు రూపొందించారు. న్యూజిలాండ్ కెప్టెన్ గా టిమ్ సీఫర్ట్ వ్యవహరిస్తున్నారు. తొలి టీ20 మ్యాచును కైవసం చేసుకునేందుకు కివీస్ జట్టు సర్వశక్తులతో సన్నద్ధమైంది.

Related posts