telugu navyamedia
రాజకీయ వార్తలు

బెస్ట్ మినిస్టర్ గా అమిత్ షా.. ఇండియాటుడే సర్వేలో వెల్లడి!

amith shah bjp

ప్రధాని మోదీ కేబినెట్లో బెస్ట్ మినిస్టర్ గా అమిత్ షా అని ఇండియాటుడే – కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీనే మళ్లీ ప్రధాని కావాలని 66 శాతం మంది కోరుకున్నారు. మరోవైపు మోదీ కేబినెట్లో అత్యున్నత పని తీరును కనబరుస్తున్న మంత్రిగా అమిత్ షాకే ఎక్కువ మంది ఓటేశారు.

అమిత్ షా బెస్ట్ మినిస్టర్ అని 39 శాతం మంది కితాబిచ్చారు. ఆ తర్వాత స్థానంలో రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. 17 శాతం మంది రాజ్ నాథ్ సింగ్ కు ఓటేశారు. వీరి తర్వాతి స్థానాల్లో వరుసగా నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, జైశంకర్ ఉన్నారు.

Related posts