భారత్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుముఖం పడతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరొనా మహమ్మారితో 684 మంది ప్రాణాలు కోల్పోయారు.
కోవిడ్ నుంచి 1,17,591 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు సంఖ్య కూడా 6 లక్షల దిగువకు పడిపోయి 5,37,045కు చేరింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.43 శాతంగా ఉండగా రికవరీ రేటు 97.37 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది.. కొత్తగా 49,16,801 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,81,49,447 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.