telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పెవిలియన్ కు చేరుకున్న భారత్ ఓపెనర్లు…

ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ తన మొదటి వికెట్ కోల్పోయింది. జాగ్రత్తగా ఆడుతూ 70 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు భారత ఓపెనర్లు గిల్, రోహిత్. కానీ ఆసీస్ బౌలర్ హాజెల్ వుడ్ వేసిన 27 వ ఓవర్లో క్యాచ్ రూపంలో 26 పరుగుల వద్ద వెనుదిగాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ పెవిలియన్ కు చేరుకోవడంతో మరో స్టార్ ఆటగాడు పుజారా బ్యాటింగ్ కు వచ్చాడు. మొదట రోహిత్ క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరుకున్న తర్వాత తన అర్ధశతకం పూర్తి చేసుకొని మరో ఓపెనర్ శుబ్‌మాన్‌ గిల్(50) కూడా ఔట్ అయ్యాడు. కమిన్స్ వేసిన 33 ఓవర్లో కామెరాన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  అయితే గిల్ కు ఇది కేవలం రెండో టెస్ట్ మ్యాచ్ కాగా మొదటి హాఫ్ సెంచరీ. గిల్ ఔట్ కావడంతో బ్యాటింగ్ కు భారత కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు. ఇక భారత ఓపెనర్లు ఇద్దరు వెనువెంటనే పెవిలియన్ కు చేరుకోవడంతో భారత్ ప్రస్తుతం 85/6 తో నిలిచింది. అయితే ఈ రోజు పూర్తికావడానికి ఇంకా 6 ఓవర్లు మాత్రమే ఉంది. చూడాలి మరి ఈ ఇద్దరు ఆటగాళ్లు మరో వికెట్ పడకుండా.. ఆడుతారా లేదా అనేది.  

Related posts