మహారాష్ట్రలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. శనివారం కొత్తగా 811 కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. కొత్త కేసుల్లో 602 ముంబైలోనివే కావడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో 21 కేసులు వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 323 కాగా, ముంబైలో 191 మంది మరణించారు. వైరస్ సోకి 57 సంవత్సరాల హెడ్ కానిస్టేబుల్ చంద్రకాంత్ గణపత్ పెందూర్కర్ మరణించారని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
శనివారం నాడు పుణెలో నలుగురు కరోనా కారణంగా మరణించారు. పుణెలో ఒకరు పింప్రి-చించావాడ్, ధూలే, సోలాపూర్ ప్రాంతాల్లో ఒక్కొక్కరూ మరణించారు. ఇంతవరకూ రాష్ట్రంలో కరోనా సోకి 1,076 మంది రికవరీ అయి డిశ్చార్జ్ అయ్యారు.ఇక మరణాల సంఖ్యను తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మంది వైద్య నిపుణులతో కూడిన టాస్క్ ఫోర్స్ ను నియమించింది.
లోకేష్ ఓ పప్పు.. అ ఆలు రావు: వైఎస్ షర్మిల