telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

న్యూజీలాండ్ కు అనుకూలంగా… వాతావరణం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్…

india lost 3 wickets in just 5 runs

మొదటి సెమీస్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ కి ఆటంకాల పుణ్యమా అని న్యూజీలాండ్ గెలిచేట్టుగానే ఉంది. వరల్డ్ కప్ ఫేవరేట్ గా కనిపించిన టీమ్ ఇండియా.. సెమీస్ నుంచే ఇంటికి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. న్యూజీలాండ్ ను 239 పరుగులకే కట్టడి చేశామన్న ఆనందం ఇండియా బ్యాటింగ్ ప్రారంభమైన కొద్దిసేపు కూడా నిలవలేదు. ప్రారంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయింది. న్యూజీలాండ్ బౌలర్ హెన్రీ ఆరంభంలోనే టీమిండియాను దారుణంగా దెబ్బ తీశాడు.

రోహిత్ శర్మ, రాహుల్ లను కేవలం ఒక్కో పరుగుకే ఇంటి ముఖం పట్టించాడు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కేవలం ఒక్క పరుగుకే ఎల్బీ డబ్ల్యూ కావడంతో టీమిండియా కేవలం 5 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. పరిస్థితి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్ గెలవడం అంటే అద్భుతాలు జరగడమే అన్నట్టుగా ఉంది.

Related posts