telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా అప్డేట్ : 81 లక్షలు దాటిన కేసులు..

Corona

దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 81 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 551 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 59,454 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,37,119 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,82,649 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 74,32,829 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,21,641 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 90.99 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో “యాక్టివ్” కేసులు 7.51శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts