telugu navyamedia
ఆరోగ్యం

‘భారత్‌’ కరోనా అప్డేట్స్‌

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.21కోట్ల మంది కొవిడ్‌ను జయించగా.. రికవరీ రేటు 97.43శాతంగా ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,40,225 మందిని బలితీసుకుంది.

మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు మళ్లీ 4లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.23శాతంగా ఉంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కేరళలో నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడ 29,322 కొత్త కేసులు బయటపడగా.. 131 మరణాలు నమోదయ్యాయి.

ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 58.85లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 67.72కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Related posts