సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి “ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా… నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన… ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద… మనుషులందు నీ కథ మహర్షి లాగ సాగదా…” అంటూ సాగే లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. శ్రీమణి లిరిక్స్ అందించగా.. విజయ్ ప్రకాష్ ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రానికి విజయ్ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీ దత్, పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ లిరికల్ వీడియోను మీరు కూడా వీక్షించండి.
previous post
ప్రకాశ్రాజ్ ‘మా’ని మరింత అభివృద్ధి చేయగలడు: బండ్ల గణేశ్