telugu navyamedia
క్రీడలు

గాయంతో ఉన్న విజయ్ శంకర్ మైదానంలోకి ఎలా వచ్చాడు ?… టీమిండియా మాజీ క్రికెటర్ అనుమానం

Murali-Karthik

ప్రపంచకప్ లో ఆడుతున్న టీమిండియాలోకి తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు ఉన్నట్టుండి గాయం అయిందని, అతడ్ని స్వదేశానికి పంపుతున్నామని టీమిండియా మేనేజ్ మెంట్ చెప్పడం, దాన్ని బీసీసీఐ కన్ఫామ్ చేయడం చాలామందిలో సందేహాలు రేకెత్తించింది. విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు మురళీ కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. “ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా విజయ్ శంకర్ డ్రింక్స్ తో మైదానంలో అడుగుపెట్టిన సమయంలో ఎలాంటి ఇబ్బందిలేకుండా నడిచాడు, అలాంటి ఆటగాడ్ని గాయంతో బాధపడుతున్నాడంటూ ఎలా తప్పించారు? గాయంతో అడుగుతీసి అడుగేయలేకపోతున్నాడన్న కారణంతోనే విజయ్ శంకర్ ను తప్పించినప్పుడు, అతడితో డ్రింక్స్ ఎలా తెప్పించుకున్నారు? ఈ సందేహం నా ఒక్కడికేనా, లేక ఇంకెవ్వరికైనా వచ్చిందా?” అంటూ మురళీకార్తీక్ ట్వీట్ చేశాడు.

Related posts