ఉగ్రవాదులు రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన రైల్వేస్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. రైళ్లలో కూడా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.