telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

విడాకుల పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్ దంపతులు…

సివిల్‌ టాపర్స్ అయిన తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న జంట ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న ఐఎఎస్ దంపతులు టీనా డాబీ, అథర్ అమీర్‌లు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం సంచలనంగా మారుతోంది. జైపూర్ లోని ఫ్యామిలీ కోర్టు-1లో వీరిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. తాము కలిసి జీవించలేమని, అందువల్ల తమకు విడాకులు మంజూరు చేయాలని టీనా డాబీ, అథర్ అమీర్ ఖాన్ లు ఫ్యామిలీ కోర్టులో సమర్పించిన విడాకుల పిటిషన్‌లో కోరారు. 2016 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు 2018 లో వివాహం చేసుకున్నారు. టీనా డాబీ 2015 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్. కాశ్మీర్ కి చెందిన అథర్ ఆ పరీక్షల్లో సెకండ్ ప్లేస్. వీరిద్దరూ రాజస్థాన్ కేడర్ అధికారులు. శిక్షణ సమయంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, దీంతో వీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. తాజాగా టీనా డాబీ సోషల్ మీడియా ఖాతాలో తన పేరులోని ఖాన్ ను తొలగించారు. అనంతరం అథర్ ఖాన్ కూడా తన ఇన్ స్టాగ్రాం నుంచి టీనా ఖాతాను అన్ ఫాలో చేశారు. గతంలో వీరిద్దరి ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ గా హిందూ మహాసభ పేర్కొంది. టీనా ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా, అమీర్ అథర్ ఈజీఎస్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Related posts