వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ ఇయాన్ బిషప్ మాట్లాడుతూ… ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ను భారత్ గెలిచి కరోనా బాధితులకు కాస్త ఊరట కలిగించాలని కోరారు. డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని బిషప్ పేర్కొన్నారు. కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, ఒక మంచి కెప్టెన్కు ఉండాల్సిన లక్షణమని విండీస్ దిగ్గజ బౌలర్ పేర్కొన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో ఇయాన్ బిషప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్లోని కరోనా పరిస్థితిని, డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మాట్లాడారు. ‘టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం విరాట్ కోహ్లీకి అతిగొప్ప విశేషం. కోహ్లీ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మంచి కెప్టెన్లకు ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి. కేన్ విలియమ్సన్తో పాటు టాప్ లెవెల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగులు చేయడమే అతడికి తెలుసు. కోహ్లీలా బాగా ఆడేవాళ్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అయితే అతడింకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది’ అని బిషప్ అన్నారు.
previous post
next post