రాజస్థాన్ లో ఇండియా ఎయిర్ ఫోర్స్ మిగ్-21 యుద్ధ విమానం గురువారం రాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
బార్మర్ జిల్లా సమీపంలో ఐఏఎఫ్ మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.యుద్ధ విమానం కుప్పకూలిన అనంతరం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఇద్దరు పైలెట్లు మరణించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. పైలెట్ల మృతి పట్ల రక్షణ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.