తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. అయితే ఈ మిల్కీ బ్యూటీకి కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టనష్టాలను చవిచూడాల్సి వచ్చింది తాప్సీ. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది తాప్సీ. ఇటీవలే “గేమ్ ఓవర్” చిత్రంతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న తాప్సి ఇప్పుడు గుజరాత్కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తాప్సీ… భూమీ పడ్నేకర్తో కలిసి నటించిన సాండ్ కీ ఆంఖ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. బయోగ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తుషార్ హీరానందాని దర్శకుడు. ఈ సినిమాలో తాప్సీ, భూమీలు వృద్దురాలైన షార్ప్ షూటర్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బాలీవుడ్లో వరుస అవకాశాలు రావటంతో ఈ భామ పలు సందర్భాల్లో దక్షిణాది సినీరంగంపై నోరు పారేసుకుంది. ఇక్కడ హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వరని, కేవలం గ్లామర్ డాల్స్గానే చూస్తారంటూ కామెంట్ చేసింది. అంతేకాదు దర్శకేంద్రుడు తెరకెక్కించిన ఝుమ్మందినాథం పాటపై ఓ మీడియా సమావేశంలో వెటకారంగా మాట్లాడి విమర్శలపాలైంది. తాజాగా ఈ బ్యూటీ మరో సంచలన కామెంట్ చేసింది. తాను కెరీర్ స్టార్టింగ్లో పాత్రల ఎంపికలో తప్పు చేశానంటోంది తాప్సీ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఆ పరిస్థితులు పెద్దగా తెలియకపోవటంతో వేరే వాళ్లు చెప్పే మాటలు విని సినిమాలు ఒప్పుకున్నాని, అయితే ఆ పాత్రలకు తాను సూట్ అవ్వనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాని వెల్లడించింది. అంతేకాదు కెరీర్ స్టార్టింగ్లో తనపై ఐరన్ లెగ్ ముద్రవేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పాత్రల ఎంపికలో తన సొంత తెలివి తేటలను మాత్రమే నమ్ముకుంటున్నానన్న తాప్సీ, ఇక మీదట పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని వెల్లడించింది.
next post