హ్యుందాయ్ బీఎస్-6లోకి మార్చిన మోడళ్లను ఈ ఏడాది చివర్లో మొదలు పెడుతుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మార్చి చివరి వరకు బీఎస్-4 వాహనాల విక్రయాన్ని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ఐ10 నియోస్ మోడల్మాత్రమే బీఎస్-6 మోడల్ అందుబాటులో ఉంది. దీనిలో కూడా పెట్రోల్ వేరింయట్ మాత్రమే లభిస్తోంది. మరోపక్క మారుతీసుజుకీ కి చెందిన ఏడు పెట్రోల్ కార్లు బీఎస్-6 నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి.
ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ మా బీఎస్-6 మోడల్ వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. క్రమ పద్దతిలో బీఎస్-6 వాహనాలను మార్కెట్లోకి తెస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని మోడళ్లను బీఎస్-6లోకి అప్గ్రేడ్చేస్తాము. మరోపక్క ధరలు కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూస్తాము.. అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్ఎస్ కిమ్ పీటీఐకు వెల్లడించారు.