అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్పుల్ ఎంటర్టైనర్ “మిస్టర్ మజ్ను”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలను విడుదల చేశారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో హైపర్ ఆది వేసిన పంచులకు అందరి మొహాల్లో నవ్వులు విరిశాయి.
“మీలో ప్లే బాయ్స్ ఎంతమంది వున్నారు?” అంటూ ఆది స్టేజ్ పై నుంచి ప్రశ్నించగా… “ఎవరూ లేరు” అంటూ అంతా అరిచారు. దీంతో ఆది “అంతా పైకి అరవిందస్వామిలా కనిపిస్తారుగానీ… లోపలంతా నిత్యానంద స్వాములే. మీలో ఎంతో మంది ప్లే బాయ్స్ వున్నారు… వాళ్లందరికీ బాబాయ్ అఖిల్… ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరిగింది. అక్కడ మేమంతా అమ్మాయిలను చూస్తుండేవాళ్లం. ఆ అమ్మాయిలంతా అఖిల్ ను చూస్తుండేవాళ్లు” అంతో వేడుకలో పాల్గొన్నవారి ముఖంలో నవ్వులు పూయించారు ఆది.
రోజా నేను మంచి స్నేహితులం: ప్రియారామన్