నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా డిసెంబర్ 31 రాత్రి రాత్రి మెట్రో రైళ్ల సమయాలను పొడిగించామని హైదరాబాద్ మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు చివరి రైలు రాత్రి 11గంటలకు బయల్దేరి 12 గంటల వరకు నడుస్తుండగా, 31వ తేదీ అర్ధరాత్రి మాత్రం 1 రాత్రి గంటకు చివరి రైలు బయల్దేరి సుమారు 2 గంటల కల్లా చివరిస్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు.
ఈ క్రమంలో మద్యం తాగి వచ్చినా మెట్రో రైలు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. మెట్రోలో ప్రయాణం చేసే సమయంలో ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయని హైదరాబాద్ మెట్రో అధికారులు హెచ్చరించారు. డిసెంబర్ 31న ఎవరూ, ఎక్కడ, ఏం చేసినా.. గుర్తించేందుకు మెట్రో కారిడార్లలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉందన్న విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలన్నారు.