నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31న అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు.