telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మౌనిక కుటుంబ సభ్యులకు.. రూ.20 లక్షలు, ఇంట్లో ఒక ఉద్యోగం

mounika hyd metro

హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్ పై భాగం నుంచి పెచ్చులూడి పడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మౌనిక మృతి చెందిన విషయం తెలిసిందే. మౌనిక కుటుంబసభ్యులకు రూ.20 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ హామీ ఇచ్చింది. దీంతో పాటు ఆమె కుటుంబసభ్యులకు రూ.15 లక్షలు ఇన్సూరెన్స్, ఒక ఉద్యోగం ఇచ్చేలా అంగీకరించినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

మౌనిక మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆసుపత్రి వద్ద ప్రజాసంఘాల నాయకులు, ఆమె కుటుంబసభ్యులు ఉన్నారు. నిన్న మౌనిక ప్రమాదానికి గురైన తర్వాత నుంచి పోస్టుమార్టం నిర్వహించే వరకూ ఎల్ అండ్ టీ అధికారులు ఎవ్వరూ రాలేదని అన్నారు. మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డితో మాట్లాడిన తర్వాత వారు స్పందించారని కుటుంబసభ్యులు తెలిపారు. మౌనిక కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం కింద ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు. కానీ, నష్టపరిహారం కింద రూ.20 లక్షలు, ఇన్సూరెన్స్ కింద ఎంత వస్తే అంత మొత్తం, ఒక ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని కుటుంబసభ్యులు చెప్పారు.

Related posts