హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఇందులో లింగంపల్లి-ఫలక్నుమా రూట్లో 9 సర్వీసులు రద్దు కాగా, ఫలక్నుమా-లింగంపల్లి రూట్లో 7, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒకటి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక సర్వీసు రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.