నటి పాయల్ ఘోష్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేయబోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్కు పలువురు బాలీవుడ్ నటీనటులు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలపై నటి హూమా ఖురేషి స్పందించారు. పాయల్ ఆరోపణలను ఖండిస్తూ హూమా ఖురేషి స్పందించారు. “అనురాగ్తో నేను చివరిసారిగా 2012-13 సమయంలో కలిసి పని చేశాను. ఆయన నాకు మంచి స్నేహితుడే కాదు.. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కూడా. నా వ్యక్తిగతానుభవంలో నాకు తెలిసినంత వరకు అనురాగ్ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. ఒకవేళ ఆయన తమతో తప్పుగా ప్రవర్తించాడని భావించారో వారు కోర్టు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. మీడియాకెక్కడం, సోషల్ మీడియాలో పోరాడటం అనే విషయాలను నేను పెద్దగా నమ్మను. అందుకనే నేను స్పందించకుండా ఉన్నాను. ఈ గొడవలోకి నన్ను లాగినందుకు చాలా కోపం వచ్చింది. అంతేకాదు ఇలాంటి పరిణామాల్లో నిరాధార ఆరోపణల వల్ల పనిచేసే ప్రదేశాల్లోని మహిళల కష్టం, శ్రమ విలువ తగ్గిపోతుంది. స్త్రీలే కాదు.. పురుషులకు కూడా మీటూ ఉద్యమం యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇదే నా చివరి స్పందన. దీనికి సంబంధించిన నన్ను ఇతర వివరణల కోసం సంప్రదించకండి” అని చెప్పుకొచ్చారు హూమా ఖురేషి.
previous post
నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..