ప్రముఖ సినీ దర్శకుడు భారతి రాజా ఇంట్లో చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన అగంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి.నగర్లోని కృష్ణన్ వీధిలో భారతిరాజా నివసిస్తున్నారు. రెండు రోజుల క్రితం రెండో అంతస్తులో నిద్ర పోయిన ఆయన మరుసటిరోజు ఉదయం కిందకు వచ్చి చూడగా రూ.లక్ష విలువైన ఐ ఫోన్, పూజ గదిలో ఉంచిన రూ.లక్ష విలువైన వెండి వస్తువులు, రూ.15 వేల నగదు అదృశ్యం కావడం గమనించి మాంబళం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అగం తకుల కోసం గాలిస్తున్నారు. అలాగే, ఆయన ఇంట్లో పనిచేస్తున్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
సుశాంత్లో ఆమె ఆశలు రేకెత్తించింది… : కంగనా కామెంట్స్