హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. షూటింగ్ స్పాట్లో బ్రహ్మానందం స్వయంగా తనకు భోజనం వడ్డిస్తున్న ఫోటోను హరీష్ శంకర్ తాజాగా ట్వీట్ చేశాడు. “ఎంతమందికో ఈ అదృష్టం. సినిమాకు చాలా రుణపడి ఉన్నాను. ‘వాల్మీకి’ సినిమా చివరి రోజు షూటింగ్ చాలా సర్ప్రైజ్లతో నిండిపోయింది” అని పోస్ట్ చేశాడు.
బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను… స్టార్ హీరోయిన్ కామెంట్స్