telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో ఎస్సీలపై వరుస దాడులు: వర్ల రామయ్య

varlaramaiah tdp

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎస్సీలపై దాడులను అరికట్టడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలుపుతూ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. ఇటువంటి ఘటనపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు.

ఎస్సీ కుటుంబం సజీవదహనానికి ప్రయత్నించినా సర్కారు స్పందించలేదని ఆయన చెప్పారు. కొన్ని రోజుల క్రితం జరిగిన శిరోముండనం కేసులో నిందితులను అరెస్టు చేయలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రూల్‌ ఆఫ్ లా అమలు కావడంలేదని హైకోర్టు కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీని హైకోర్టుకి పిలిపించి హెచ్చరించినా సర్కారు పాలనలో మార్పు రాలేదని అన్నారు.

Related posts