తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొన్న అప్పులను రద్దు చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.గురువారం నెల్లూరులో నిర్వహించిన వైసీపీ ఎన్నికల సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తీసుకోవాలని ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చే రుణాలను మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు.
ప్రాధమిక విద్య నుండి ఇంజనీరింగ్ చదివే వరకు విద్యను ప్రైవేటీకరించారని జగన్ ఆరోపించారు. నాలుగున్నర ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేయని చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు.
పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్..