telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ వల్ల నెలకు రూ.10 కోట్ల నష్టం: మంత్రి అవంతి

avanthi srinivas ycp

లాక్ డౌన్ కారణంగా పర్యాటక శాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో హోటళ్లు మూతపడ్డాయని అన్నారు. కేంద్ర నిబంధనలతో జూన్ 8 నుంచి హోటళ్లు, పర్యాటక రంగ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. టూరిస్టులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.

రాష్ట్రానికి తీర, అటవీప్రాంతాలు, హిల్ స్టేషన్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రివర్, టెంపుల్ టూరిజం వంటి విశిష్టతలు ఉన్నాయని, పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని, పర్యాటక విభాగాన్ని ఆదాయం తెచ్చే శాఖగా మార్చుతామని చెప్పారు. గండికోట, హార్సిలీహిల్స్, అరకు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.

Related posts