విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మొదట్లో “ఎఫ్ 2” చిత్రంతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించారు. త్వరలో “వెంకీ మామ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో వెంకటేష్ మేనల్లుడు నాగ చైతన్య కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా… వెంకటేష్ త్వరలో త్రినాధరావు నక్కిన, తరుణ్ భాస్కర్లతో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయనున్నాడు. తరుణ్ భాస్కర్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తరుణ్ భాస్కర్ చిత్ర స్టోరీని సిద్ధం చేసుకుంటుండగా, ఈ చిత్రం గుర్రపు పందెం ప్రధాన నేపథ్యంగా ఉంటుందని తెలుస్తుంది. చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం మలక్పేట్లోని హైదరాబాద్ రేస్ క్లబ్లో జరుగుతుందట. వెంకీ ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందట. సురేష్ బాబు చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వెంకీ గతంలో బాక్సింగ్ నేపథ్యంలో “గురు” అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.
previous post
next post