పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీపై ఏపీ హోం మంత్రి సుచరిత మండిపడ్డారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేంద్రాల్లో ఉన్నవాళ్లు ఎవరనేది తేల్చేందుకు నిజనిర్ధారణ చేస్తామని అసలైన బాధితులు, పెయిడ్ ఆర్టిస్టులను గుర్తిస్తామని చెప్పారు. నిజమైన బాధితులుంటే వారిని తమ గ్రామాలకు తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు.
పల్నాడులో తమ కార్యకర్తలు, నాయకులపై భౌతికదాడులు జరిగాయని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. 2014-19 వరకు ఆరు రాజకీయ హత్యలు జరిగాయని, 2019 ఎన్నికల తర్వాత ఎక్కడా ఇలాంటి హత్యలు జరగలేదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ చేస్తున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 11న ఛలో ఆత్మకూరు కు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి ఇవ్వాలని ఎవరైనా అడిగితే పరిశీలిస్తామని చెప్పారు.