రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రత కారణంగానే జూన్ 11 వరకు సెలవులు పొడిగించారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎండలు అధికంగా ఉన్న కారణంగా.. మే 31వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించారు.