సినీ నటుడు విజయ్ సేతుపతి హిందూ దేవుళ్ళకు సంబంధించిన పూజలపై చేసిన వ్యాఖ్యలు హిందువుల ఆగ్రహానికి కారణమయ్యాయి. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ ఓ టీవీ ఛానల్ లో విజయ్ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నై నగర పోలీసు కమిషనర్కు లేఖ రాసింది. విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. విజయ్ వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని నిలదీసింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, నెటిజన్లు కూడా విజయ్ సేతుపతిపై మండిపడుతున్నారు. ట్రోలింగ్, మీమ్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
previous post
ఆ స్టార్ హీరోని పెళ్ళి చేసుకుని ఉండేదానిని… రకుల్ కామెంట్స్