telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జమ్మలమడుగులో .. భారీ భద్రత.. 2వేల మంది రక్షణ సిబ్బందిని మోహరించిన ..ఈసీ ..

high security in jammalamadugu

రేపు ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది ఎన్నికల సంఘం. కొన్ని ప్రాంతాలను సమస్యాత్మకంగా భావించడంతో అక్కడ భారీ రక్షణ ఏర్పాట్లు చేసింది ఈసీ. రేపటి పోలింగ్ కల్లా అన్ని సిద్ధంలా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ అధికారులను మోహరిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలోని జమ్మలమడుగులో అధికారులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న ప్రాంతం కావడంతో పాటు గత అనుభవాల దృష్ట్యా ఏకంగా 2,000 మంది పోలీసులను అధికారులు మోహరించారు.

వీరితో పాటు జమ్మలమడుగుకు చేరుకున్న కేంద్ర బలగాలు.. కవాతును నిర్వహించాయి. అంతేకాకుండా నియోజకవర్గం పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్‌ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts