telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు ముందు కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

high court on new building in telangana

తెలంగాణలో ఇటీవల విడుదలైన కానిస్టేబుల్‌ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనచేపట్టారు. అభ్యర్థులు సోమవారం హైకోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మందికిపైగా పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ కటాఫ్‌ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని.. అర్హత కన్నా ఎక్కువ మార్కులు సాధించినా మెరిట్‌ లిస్ట్‌లో తమ పేరు లేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Related posts