telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌పై విచారణకు సిట్ ఏర్పాటు

disa accused Funeral will be tomorrow

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌ భగవత్‌ నేతృత్వం వహించనున్నారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఈ బృందంలో సభ్యులు.

నిందితుల ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు నేడు విచారించనుంది.

Related posts