తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల అభ్యంతరాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని పేర్కొంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత కొన్ని నెలలుగా ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషనర్ల అభ్యంతరాలను కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికలకు పచ్చాజెండా ఊపింది. ఈ ఎన్నికలను ఆగస్టు 15లోపే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.
టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని