telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సర్కారు వారి పాట”లో హీరోయిన్ చేంజ్ ?

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకోసం డెట్రాయిట్ నగరానికి వెళుతున్నట్టు సమాచారం. అక్కడ భారీ షెడ్యూలు నిర్వహిస్తారని, లొకేషన్ల ఎంపిక కోసం త్వరలో దర్శకుడు, ఛాయాగ్రాహకుడు త్వరలో డెట్రాయిట్ వెళతారని అంటున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో అక్కడ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే తాజా సమాచారాన్ని బట్టి కీర్తిసురేష్ ను మార్చే అవకాశం వుందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై చిత్ర నిర్మాతలు, దర్శకుడు చర్చించి, మరొక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో మరికొందరి పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts