మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా కొచ్చిలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “పృథ్వీ నటించిన “అయ్యా” సినిమా నాకు చాలా నచ్చింది. ఆ సినిమాలో పృథ్వీ నటన చూశాక.. అతను “సైరా”లో నటిస్తే బాగుంటుందనిపించింది. అయితే ఆ సమయంలో ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల “సైరా”లో చేయడం కుదరలేదు” అని చిరంజీవి చెప్పారు. అనంతర పృథ్వీ మాట్లాడుతూ “సైరా”లో నటించలేకపోయినందుకు చాలా బాధపడ్డా. చిరంజీవిగారు నాకు ఫోన్ చేసి ఈ సినిమాలో నటించమని అడిగారు. అయితే ఆ సమయంలో నేను వేరే సినిమా కోసం స్పెయిన్లో ఉన్నా. “సైరా” ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇంత భారీ సినిమాను నిర్మించిన రామ్చరణ్కు సెల్యూట్” అని పృథ్వీ అన్నారు.
previous post