telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

భోజనం చేసాక పెరుగు తింటున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి…

చక్కని రుచి కలిగి ఉండే గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు భోజనం చివర్లో పెరుగుతో తినకపోతే అస్సలు తృప్తి చెందరు. భోజనం అయిపోనట్టుగానే భావిస్తారు. కానీ కొంతమందికి పెరుగు కాదు కదా, పాలు, పాల సంబంధిత పదార్థాలు అస్సలు నచ్చవు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఉపయోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే పెరుగుతో అన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి మరి. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
– కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
– కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి తగ్గుతాయి.
– కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
– కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
– ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్ధకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
– పెరుగులో కొన్ని ఓట్స్‌ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్‌, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
– పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
– పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినా. దీని వల్ల ఫోలిక్‌ యాసిడ్‌ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.
– పెరుగులో ఆరెంజ్‌ జ్యూస్‌ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్‌ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
– పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.

Related posts