చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.అయితే చాలా మంది కరోనా వచ్చిన వారు.. ఇంట్లో నే ఉండి.. కరోనాకు చెక్ పెడుతున్నారు. ఇలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే కరోనా ను ఇంకా ఈజీగా ఎదురుకోవచ్చు.
చిట్కాలు:
గాలి, వెలుతురు బాగా పడే రూం లో ఒంటరిగా ఉండాలి
తరచూ చేతులు శుభ్ర పరుచుకోవాలి
ప్రతి 4గంటలకు ఓ సారి.. ఆక్సి జన్ లెవెల్స్, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి
నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి
అది ఆక్సి జన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఛాతీ మీద పడుకొని.. గట్టిగా ఊపిరి తీసుకోవాలి
రోజుకు మూడసార్లు ఆవిరి పట్టాలి
మల్టీ విటమిన్స్, మినిరల్స్ తీసుకోవాలి