ఏపీలో ఈ మధ్యే పంచైతే ఎన్నికలు ముగియగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పై దృష్టి పెట్టారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణకు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలు అయ్యాయి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే హైకోర్టుకు నివేదించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్ ఇచ్చినట్టు ఎస్ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ ఇంకా మనుగడలో ఉండగా, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
రాజకీయాలు కావాలంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలి: జవహర్