సుదర్శన యాగంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. సిద్దిపేట దీకొండ మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో మూడు రోజులపాటు జరుగుతున్న శ్రీ సుదర్శన నారసింహ యాగం మహపూర్ణాహుతి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలన బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. స్వామి వారి అనుగ్రహంతో మరోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిందన్నారు.
ప్రజలకు సంక్షేమం అందించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉండబతోందన్నారు. సిద్దిపేట ఒక ఆధ్యాత్మిక నెలవని, ఎన్నో యజ్ఞయాగాలకు సిద్దిపేట కేంద్రంగా ఉందని చెప్పారు. ప్రప్రథమంగా ఆరు బయట శ్రీనివాస కళ్యాణం సిద్దిపేట లో నిర్వహించడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.