రాష్ట్ర వ్యాప్తంగా 7,400 కోట్లు రైతుబంధు సాయం అందజేశామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనాతో ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఆపడంలేదని తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్ లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగడం లేదన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. ఈ విపత్కర సమయంలో కూడా పేదల ఆసరా పెన్షన్ల కోసం వేయి కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.